Kanaka Durga: దుర్గమ్మ బంగారం బ్యాంకులో డిపాజిట్

Kanaka Durga Temple Deposits Gold Valued at 2658 Crore
షార్ట్స్‌లో చూడండి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మకు భక్తులు సమర్పించిన బంగారు ఆభరణాలను దేవస్థానం బ్యాంకులో డిపాజిట్ చేసింది. అదనపు ఆదాయం పొందే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. సోమవారం నాడు అమ్మవారికి చెందిన 29.510 కిలోల బంగారాన్ని గాంధీనగర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‍బీఐ) బ్రాంచీలో జమ చేశామన్నారు.

ఈ కార్యక్రమం అనంతరం ఈవో శీనానాయక్ మీడియాతో మాట్లాడుతూ.. డిపాజిట్ చేసిన బంగారం ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ. 26.58 కోట్లు ఉంటుందని చెప్పారు. ఈ డిపాజిట్‌పై ఆలయానికి సంవత్సరానికి 0.60 శాతం చొప్పున వడ్డీ లభిస్తుందని తెలిపారు. దీనివల్ల అమ్మవారి ఖజానాకు అదనపు ఆదాయం సమకూరుతుందని వివరించారు.

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పల్లంరాజు, నగల నిర్ధారణ అధికారి, పర్యవేక్షకుడు సుబ్రహ్మణ్యం, దుర్గ గుడి ఏఈవోలు చంద్రశేఖర్, రమేష్‌బాబు వంటి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ బంగారం బదిలీ ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. ఆలయ అధికారులు బంగారాన్ని బ్యాంకు అధికారులకు అధికారికంగా అప్పగించారు. దేవస్థానానికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన బంగారాన్ని ఈ విధంగా డిపాజిట్ చేయడం ద్వారా ఆలయానికి ఆర్థికంగా మరింత ప్రయోజనం చేకూరుతుంది.
Go Back to Shorts
Kanaka Durga
Kanaka Durga Temple
Vijayawada
Indrakilaadri
Gold Deposit
SBI
Temple Revenue
Andhra Pradesh Temples
Devasthanam
Temple Gold

More Telugu News