Korupalli Shyam: తన బిడ్డలకు 'తల్లికి వందనం' రాలేదని టవర్ ఎక్కిన తండ్రి... వీడియో ఇదిగో!

Korupalli Shyam Climbs Tower Over Thalliki Vandanam Scheme Funds
షార్ట్స్‌లో చూడండి
ప్రభుత్వ పథకం డబ్బులు అందలేదన్న ఆవేదనతో ఓ తండ్రి ఏకంగా హై టెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. ఈ అనూహ్య ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కలకలం రేపింది. కింద ఉన్న కూతురు "కిందకి దిగు డాడీ" అంటూ కన్నీటిపర్యంతం కావడం అక్కడున్న వారిని కదిలించింది.

వివరాల్లోకి వెళితే, భీమవరంలోని మెంటేవారితోటకు చెందిన కోరుపల్లి శ్యామ్, తన పిల్లలకు 'తల్లికి వందనం' పథకం కింద డబ్బులు జమ కాలేదని ఆరోపిస్తూ స్థానికంగా ఉన్న ఓ సెల్ టవర్‌పైకి ఎక్కాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.

టవర్‌పై ఉన్న తండ్రిని చూసి ఆయన చిన్నారి కూతురు తల్లడిల్లిపోయింది. "కిందకి దిగు డాడీ" అంటూ గట్టిగా అరుస్తూ ప్రాధేయపడింది. మరోవైపు, శ్యామ్ భార్య, ఇతర కుటుంబ సభ్యులు డబ్బులు అకౌంట్‌లో జమ అయ్యాయని చెప్పినా అతను నమ్మలేదు. తనకు అధికారులు రాతపూర్వకంగా హామీ ఇస్తేనే కిందకు దిగుతానని భీష్మించుకు కూర్చున్నాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని, సమస్యను పరిష్కరిస్తామని అతడికి నచ్చజెప్పారు. దాంతో, శ్యామ్ శాంతించి టవర్ పైనుంచి కిందకు దిగాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
Go Back to Shorts
Korupalli Shyam
Thalliki Vandanam
Andhra Pradesh
Bhimavaram
West Godavari
Protest
Cell Tower
Government Schemes
Financial Assistance

More Telugu News