Simhachalam: సింహాచలం క్షేత్రంలో భక్తులకు తప్పిన ప్రమాదం

Simhachalam Temple Shed Collapse Averted Major Accident
షార్ట్స్‌లో చూడండి
విశాఖ జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం సింహాచలంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తుల కోసం తొలి పావంచా వద్ద నిర్మించిన భారీ రేకుల షెడ్డు ఒక్కసారిగా కుప్పకూలింది. అదృష్టవశాత్తూ, ఈ దుర్ఘటన జరిగిన సమయంలో షెడ్డు కింద భక్తులెవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. దీంతో భక్తులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తుల సౌకర్యార్థం ఈ తాత్కాలిక షెడ్డును ఇటీవల ఏర్పాటు చేశారు. అయితే, షెడ్డు పునాదులను కాంక్రీటుతో పటిష్టం చేయకుండా నిర్మించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. భారీ షెడ్డు బరువును బలహీనమైన పునాదులు మోయలేకపోవడంతో అది ఒక్కసారిగా నేలమట్టమైంది.

సాధారణంగా ఈ ప్రాంతంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం సింహాద్రి అప్పన్న దయేనని భక్తులు అంటున్నారు. ఈ ఘటనతో ఆలయ పరిసరాల్లో చేపట్టే నిర్మాణాల నాణ్యతపై భక్తుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.
Go Back to Shorts
Simhachalam
Simhadri Appanna
Simhachalam Temple
Visakha District
Giri Pradakshina
Temple Shed Collapse
Andhra Pradesh Temples
Temple Construction Quality
Hindu Pilgrimage

More Telugu News