Nandamuri Balakrishna: బాలకృష్ణ ఆదేశాలతో హిందూపురం నియోజకవర్గంలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో తెలుగుదేశం పార్టీ 'సుపరిపాలనలో తొలి అడుగు' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వ లక్ష్యాలను, సుపరిపాలన విధానాలను ప్రజలకు వివరించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

శుక్రవారం నాడు మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి (పీఏ) శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీడీపీ మండల కన్వీనర్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నేతలు మొదట స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధికారికంగా ఇంటింటి ప్రచారాన్ని మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు జవాబుదారీగా ఉండే పాలన గురించి వివరించారు. ప్రజలతో మమేకమవుతూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బేకరీ గంగాధర్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ఆనంద్ కుమార్, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ అశ్వర్థ రెడ్డితో పాటు శ్రీదేవి, అంజనమ్మ, లక్ష్మీదేవి, ఇతర స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Nandamuri Balakrishna
Hindupuram
Chilamattur
Telugu Desam Party
TDP
Suparipalanalalo Tholi Adugu
Andhra Pradesh Politics
Welfare Schemes
Sri Satya Sai District
AP Elections 2024

More Telugu News