కుమారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత‌ పవన్ కల్యాణ్ ఒకేరోజు రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. ఒకవైపు తండ్రిగా తన కుమారులతో సమయం గడుపుతూనే, మరోవైపు కీలకమైన ప్రభుత్వ కార్యక్రమాలకు సిద్ధమవుతూ బిజీగా ఉన్నారు. శుక్రవారం ఆయన తన పెద్ద కుమారుడు అకీరా నందన్, చిన్న కుమారుడు మార్క్ శంకర్‌లతో కలిసి మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా పవన్ తన ఇద్దరు కుమారులతో కలిసి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అభిమానులు ‘తండ్రీ తనయులు’ అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కుటుంబంతో కాసేపు గడిపిన వెంటనే పవన్ కల్యాణ్ తన అధికారిక విధుల్లో నిమగ్నమయ్యారు. మంగళగిరిలో పార్టీ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో సమావేశమై పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మార్కాపురం నియోజకవర్గ పర్యటనకు బయలుదేరారు.

ఈ పర్యటనలో జలజీవన్‌ మిషన్‌లో భాగంగా రూ.1,290 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న తాగునీటి పథకానికి పవన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Pawan Kalyan
AP Deputy CM
Janasena
Akira Nandan
Mark Shankar
Mangalagiri
Drinking water project
Jal Jeevan Mission
Markapuram

More Telugu News