PV Narasimha Rao: పీవీకి నివాళి అర్పించిన చంద్రబాబు, లోకేశ్

Chandrababu Naidu Pays Tribute to PV Narasimha Rao
షార్ట్స్‌లో చూడండి
భారత మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు 104వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఆయన అందించిన సేవలను, ముఖ్యంగా ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలతో దేశ గతిని మార్చిన మహనీయుడు పీవీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. పీవీ నరసింహారావు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొంటూ ఎక్స్ వేదికగా నివాళి అర్పించారు. "భారత మాజీ ప్రధాని  పీవీ నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాను. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉండగా ప్రధాని బాధ్యతలు స్వీకరించి ఆర్థిక సంస్కరణల ద్వారా దేశగతిని మార్చిన పీవీ ఎప్పటికీ స్ఫూర్తిగానే నిలుస్తారు. ఆ మహనీయుడి స్మృతికి మరొక్క మారు నివాళి అర్పిస్తున్నాను"

అదే విధంగా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పీవీకి నివాళులర్పించారు. తొలి తెలుగు ప్రధానిగా, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా పీవీ కీర్తి గడించారని లోకేశ్ గుర్తుచేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పీవీ దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.

Go Back to Shorts
PV Narasimha Rao
Chandrababu Naidu
Nara Lokesh
Former Prime Minister
Economic Reforms
Bharat Ratna
Andhra Pradesh
Telugu Prime Minister
Indian Politics

More Telugu News