Badruddin Halani: అహ్మదాబాద్ విషాదం: మనవరాళ్లను చూసేందుకు వెళ్తూ.. ప్రముఖ వ్యాపారవేత్త బద్రుద్దీన్ హలానీ మృతి
- అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది దుర్మరణం
- మృతుల్లో ప్రముఖ గుజరాతీ వ్యాపారవేత్త బద్రుద్దీన్ హలానీ, ఆయన భార్య, మరదలు
- మనవరాళ్లను చూడటానికి, సైనిక్ స్కూల్ నిధుల సేకరణకు వెళ్తూ బద్రుద్దీన్ మృత్యువాత
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశంలో జరిగిన అతిపెద్ద విమాన దుర్ఘటనల్లో ఒకటిగా మిగిలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో గుజరాత్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బద్రుద్దీన్ హలానీ, ఆయన భార్య యాస్మిన్, మరదలు మాలెక్ కూడా ఉన్నారు.
గుజరాత్లోని ఆనంద్కు చెందిన బద్రుద్దీన్ హలానీ తన మనవరాళ్లతో సమయం గడిపేందుకు లండన్ బయలుదేరారు. ఈ పర్యటనలోనే, తన కలల ప్రాజెక్టు అయిన సిల్వాసాలోని సైనిక్ స్కూల్ కోసం నిధులు సేకరించడానికి అమెరికా వెళ్లాలని కూడా ఆయన ప్రణాళిక వేసుకున్నారు. ప్రయాణానికి ముందు గురువారం మధ్యాహ్నం 1:17 గంటలకు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడుతూ తన భార్య, స్నేహితులు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పది నిమిషాల తర్వాత 1:27 గంటలకు విమానం నుంచే తన సోదరుడికి ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం 1:39 గంటలకు విమానం టేకాఫ్ అయింది, కానీ సెకన్ల వ్యవధిలోనే సమీపంలోని ఒక భవనాన్ని ఢీకొని మంటల్లో చిక్కుకుంది.
"బద్రుద్దీన్ సామాజిక సేవకు అంకితమయ్యారు. సిల్వాసాలోని సైనిక్ స్కూల్ ఆయన కలల ప్రాజెక్టు. మనవరాళ్లతో గడపాలని ఎంతగానో ఆశపడ్డారు" అని బద్రుద్దీన్ సోదరుడు రాజుభాయ్ హలానీ ఎన్డీటీవీకి తెలిపారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో బద్రుద్దీన్కు ఉన్న పరిచయాన్ని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు.
మృతదేహాలు చాలా వరకు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో, అధికారులు బాధితుల గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బద్రుద్దీన్ కుమారుడు అసిమ్ హలానీ శనివారం అహ్మదాబాద్ చేరుకుని, తన తండ్రి మృతదేహాన్ని స్వీకరించే ప్రక్రియలో భాగంగా డీఎన్ఏ ప్రొఫైలింగ్ కోసం ఆసుపత్రికి వెళ్లారు.
ఈ సందర్భంగా అసిమ్ హలానీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. "మా అమ్మాయిలిద్దరూ తాతయ్య, నానమ్మ లండన్ వస్తున్నారని ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశారు. వాళ్ల కోసం గ్రీటింగ్ కార్డులు కూడా తయారుచేశారు. ఇప్పుడు ఆ కార్డులు ఎవరికిస్తారు? మా కుటుంబానికి ఇది చాలా కష్టమైన పరిస్థితి" అని ఆయన ఎన్డీటీవీతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తన తండ్రి ప్రేమను గుర్తుచేసుకుంటూ "నాకూ నా చిన్ననాటి మధుర జ్ఞాపకాలున్నాయి. మా నాన్న నన్నెప్పుడూ తిట్టలేదు. నేను ఒక బొమ్మ అడిగితే ఆయన ఎన్నో తెచ్చిచ్చేవారు. అలాంటి ప్రేమ, ఆప్యాయత మా అమ్మాయిలకు కూడా దొరకాలని నేను కోరుకున్నాను. నా పెద్ద కుమార్తె ఇక్కడ పుట్టినప్పుడు నాన్నగారు ఆమెను భుజాలపై ఎత్తుకుని తిప్పేవారు" అంటూ గద్గద స్వరంతో చెప్పారు.
గుజరాత్లోని ఆనంద్కు చెందిన బద్రుద్దీన్ హలానీ తన మనవరాళ్లతో సమయం గడిపేందుకు లండన్ బయలుదేరారు. ఈ పర్యటనలోనే, తన కలల ప్రాజెక్టు అయిన సిల్వాసాలోని సైనిక్ స్కూల్ కోసం నిధులు సేకరించడానికి అమెరికా వెళ్లాలని కూడా ఆయన ప్రణాళిక వేసుకున్నారు. ప్రయాణానికి ముందు గురువారం మధ్యాహ్నం 1:17 గంటలకు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడుతూ తన భార్య, స్నేహితులు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పది నిమిషాల తర్వాత 1:27 గంటలకు విమానం నుంచే తన సోదరుడికి ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం 1:39 గంటలకు విమానం టేకాఫ్ అయింది, కానీ సెకన్ల వ్యవధిలోనే సమీపంలోని ఒక భవనాన్ని ఢీకొని మంటల్లో చిక్కుకుంది.
"బద్రుద్దీన్ సామాజిక సేవకు అంకితమయ్యారు. సిల్వాసాలోని సైనిక్ స్కూల్ ఆయన కలల ప్రాజెక్టు. మనవరాళ్లతో గడపాలని ఎంతగానో ఆశపడ్డారు" అని బద్రుద్దీన్ సోదరుడు రాజుభాయ్ హలానీ ఎన్డీటీవీకి తెలిపారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో బద్రుద్దీన్కు ఉన్న పరిచయాన్ని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు.
మృతదేహాలు చాలా వరకు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో, అధికారులు బాధితుల గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బద్రుద్దీన్ కుమారుడు అసిమ్ హలానీ శనివారం అహ్మదాబాద్ చేరుకుని, తన తండ్రి మృతదేహాన్ని స్వీకరించే ప్రక్రియలో భాగంగా డీఎన్ఏ ప్రొఫైలింగ్ కోసం ఆసుపత్రికి వెళ్లారు.
ఈ సందర్భంగా అసిమ్ హలానీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. "మా అమ్మాయిలిద్దరూ తాతయ్య, నానమ్మ లండన్ వస్తున్నారని ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశారు. వాళ్ల కోసం గ్రీటింగ్ కార్డులు కూడా తయారుచేశారు. ఇప్పుడు ఆ కార్డులు ఎవరికిస్తారు? మా కుటుంబానికి ఇది చాలా కష్టమైన పరిస్థితి" అని ఆయన ఎన్డీటీవీతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తన తండ్రి ప్రేమను గుర్తుచేసుకుంటూ "నాకూ నా చిన్ననాటి మధుర జ్ఞాపకాలున్నాయి. మా నాన్న నన్నెప్పుడూ తిట్టలేదు. నేను ఒక బొమ్మ అడిగితే ఆయన ఎన్నో తెచ్చిచ్చేవారు. అలాంటి ప్రేమ, ఆప్యాయత మా అమ్మాయిలకు కూడా దొరకాలని నేను కోరుకున్నాను. నా పెద్ద కుమార్తె ఇక్కడ పుట్టినప్పుడు నాన్నగారు ఆమెను భుజాలపై ఎత్తుకుని తిప్పేవారు" అంటూ గద్గద స్వరంతో చెప్పారు.