ఇది మాటలకు అందని ఘోర విషాదం: విమాన ప్రమాదంపై నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి

Nandamuri Balakrishna Shocked by Gujarat Air India Plane Crash
షార్ట్స్‌లో చూడండి
గుజరాత్‌లో సంభవించిన ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్ జాతిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇది మాటలకు అందని ఘోర విషాదమని ఆయన అమరావతిలో వ్యాఖ్యానించారు. ఈ దుర్ఘటనలో భారతీయులతో పాటు విదేశీయులు కూడా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘోర ప్రమాదంపై నందమూరి బాలకృష్ణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "ప్రయాణికులు, విమాన సిబ్బందితో పాటు, విమానం కూలిన ప్రదేశంలో మరికొందరు ప్రాణాలు కోల్పోయారన్న వార్త మనసును కలచివేస్తోంది" అని పేర్కొన్నారు. ఇది ఒక జాతీయ విపత్తు అని, ఈ క్లిష్ట సమయంలో ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ దళాలు, స్థానిక అధికారులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నారు.
Go Back to Shorts
Nandamuri Balakrishna
Air India Flight AI-171
Gujarat plane crash
Ahmedabad airport accident

More Telugu News