హనీమూన్ మర్డర్ కేసుతో మేఘాలయకు చెడ్డపేరు.. బాధిత కుటుంబాలపై ఆ రాష్ట్ర మంత్రి ఆగ్రహం
- మా రాష్ట్రం పరువు తీశారు.. క్షమాపణ చెప్పకుంటే పరువునష్టం దావా వేస్తామని వార్నింగ్
- నిందితులను మేఘాలయకు తీసుకొస్తామని మంత్రి స్పష్టీకరణ
- కేసు దర్యాప్తును ఏ ఏజెన్సీకి అప్పగించినా అభ్యంతరం లేదని వెల్లడి
"మేఘాలయ రాష్ట్రం, ఇక్కడి ప్రజల పరువు తీసినందుకు సోనమ్, రాజా రఘువంశీల కుటుంబాల నుంచి మేము క్షమాపణ కోరుతున్నాము. వారు దీనికి అంగీకరించకపోతే పరువు నష్టం కేసు దాఖలు చేస్తాము" అని మంత్రి హెచ్చరించారు. కేసు దర్యాప్తు గురించి ప్రస్తావిస్తూ, "హత్య జరిగింది ఇక్కడే కాబట్టి నిందితులను ఇక్కడికే తీసుకువస్తాము. ఈ కేసును మా పోలీసులు విచారిస్తారు. ఒకవేళ సీబీఐకి లేదా మరేదైనా కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తామన్నా మాకు అభ్యంతరం లేదు" అని మంత్రి అలెగ్జాండర్ స్పష్టం చేశారు.