టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ద‌ర్శ‌కుడు ర‌వికుమార్ చౌద‌రి హఠాన్మరణం

ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి (A.S. Ravi Kumar Chowdary) మరణవార్త తెలుగు సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ వార్త తెలియగానే తెలుగు చిత్రసీమలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఆయ‌న‌ గోపీచంద్ కథానాయకుడిగా తెరకెక్కిన 'యజ్ఞం' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో ఆయన పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. ఆ తర్వాత నాగార్జునతో ', నందమూరి బాలకృష్ణతో 'వీరభద్ర' వంటి భారీ ప్రాజెక్టులకు దర్శకత్వం వహించారు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వెండితెరకు పరిచయమైన తొలి విడుదల చిత్రం 'పిల్లా నువ్వు లేని జీవితం' కూడా ఈయన దర్శకత్వంలోనే రూపుదిద్దుకుంది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'తిరగబడరా స్వామి' ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం.

ఆయన మరణవార్తతో సహచర దర్శకులు, నటీనటులు, అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ పలువురు సంతాపం తెలుపుతున్నారు. ఏఎస్ రవికుమార్ చౌదరి మరణం తెలుగు సినిమాకు తీరని లోటని, ఆయన అందించిన చిరస్మరణీయ చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుండిపోతారని సినీ ప్రముఖులు పేర్కొన్నారు.


More Telugu News