TPCC: టీపీసీసీ కొత్త కమిటీ వచ్చేసింది: ఏఐసీసీ ప్రకటన, కీలక పదవులు వీరికే!

TPCC New Committee Announced AICC Key Positions Revealed
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నూతన కార్యవర్గాన్ని ఏఐసీసీ సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. నూతన కమిటీలో పలువురు సీనియర్లు, యువ నాయకులతో పాటు ప్రస్తుత ప్రజాప్రతినిధులకు కూడా కీలక బాధ్యతలు అప్పగించారు.

కొత్తగా ఏర్పాటు చేసిన ఈ టీపీసీసీ కార్యవర్గంలో మొత్తం 27 మందిని ఉపాధ్యక్షులుగా నియమించినట్లు ఏఐసీసీ తన ప్రకటనలో స్పష్టం చేసింది. వీరిలో పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) రఘువీర్‌రెడ్డి, శాసనసభ్యులు (ఎమ్మెల్యేలు) నాయిని రాజేందర్‌రెడ్డి, వి. వంశీ కృష్ణ ఉన్నారు. అదేవిధంగా, శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీలు) బల్మూరి వెంకట్‌తో పాటు సీనియర్ నేత, మాజీ మంత్రి బసవరాజు సారయ్య కూడా ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు.

టీపీసీసీ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో మరింత విస్తృతం చేసేందుకు 69 మందిని ప్రధాన కార్యదర్శులుగా కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ జాబితాలో కూడా పలువురు శాసనసభ్యులకు ప్రాధాన్యత ఇచ్చింది. ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన వారిలో ఎమ్మెల్యేలు వేడ్మ బొజ్జు, పర్ణికారెడ్డి, మట్టా రాఘమయి తదితరులు ఉన్నారు.
Go Back to Shorts
TPCC
Telangana Congress
AICC
Revanth Reddy
Raghuveer Reddy
Naini Rajender Reddy

More Telugu News