శ్రేయస్ ను మెచ్చుకున్న పాండ్య
- అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడన్న ముంబై ఇండియన్స్ సారథి
- మంచి స్కోర్ చేసినా కాపాడుకోలేకపోయామని విచారం
- బౌలింగ్ యూనిట్ అనుకున్నంతగా రాణించలేదని వ్యాఖ్య
ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 41 బంతుల్లో 87 పరుగులు చేశాడు. సిక్సర్ తో జట్టును విజయతీరానికి చేర్చాడు. ఇందులో 5 ఫోర్లు, 8 సిక్స్లు ఉన్నాయి. అంటే ఏకంగా 68 పరుగులు.. ఫోర్లు, సిక్స్ల ద్వారానే సాధించాడు. కాగా, ఈ ఓటమితో ముంబయి ఇంటిముఖం పట్టగా మంగళవారం ఇదే వేదికపై జరగనున్న ఫైనల్స్ లో పంజాబ్ కింగ్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.