Tejashwi Yadav: తండ్రైన తేజస్వీ యాదవ్.. ఆస్పత్రికి వెళ్లి మమతా బెనర్జీ ఆశీస్సులు!
- తేజస్వీ యాదవ్, రాజశ్రీ దంపతులకు మగబిడ్డ
- కోల్కతా ఆస్పత్రిలో రాజశ్రీ ప్రసవం
- 'ఎక్స్'లో తేజస్వీ ప్రకటన, ఫోటో షేర్
- ఆస్పత్రికి వెళ్లి మమతా బెనర్జీ శుభాకాంక్షలు
- లాలూ కుటుంబానికి దీదీ అభినందనలు
- తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని మమత వెల్లడి
ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తండ్రి అయ్యారు. ఆయన అర్ధాంగి రాజశ్రీ యాదవ్ కోల్కతాలోని ఒక ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను తేజస్వీ యాదవ్ స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
రాజశ్రీ యాదవ్ కోల్కతాలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చినట్లు తేజస్వీ 'ఎక్స్' వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా నవజాత శిశువుతో ఉన్న ఒక ఫొటోను కూడా ఆయన పంచుకున్నారు. దీంతో ఆయనకు, వారి కుటుంబ సభ్యులకు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు పలువురు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ విషయం తెలియడంతో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసుపత్రికి స్వయంగా వెళ్లి తేజస్వీ యాదవ్ దంపతులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పరామర్శకు సంబంధించిన ఫొటోలను మమతా బెనర్జీ తన 'ఎక్స్' ఖాతాలో పంచుకున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కూడా ఆమె అభినందనలు తెలిపారు.
"తేజస్వీ యాదవ్ అర్ధాంగి రాజశ్రీ యాదవ్ మగబిడ్డకు జన్మనివ్వడం చాలా సంతోషంగా ఉంది. వారి ఆనందంలో పాలుపంచుకోవడం నాకు ఆనందాన్నిచ్చింది. ఆ దంపతులకు, లాలూ గారి కుటుంబానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ఆశీస్సులు" అని మమతా బెనర్జీ ట్వీట్లో పేర్కొన్నారు.
"ఈ రోజు వారిని కలవడం ఆనందంగా ఉంది. తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. రాజశ్రీ కోల్కతాలో ఉన్న విషయం తెలుసు. తనకు బిడ్డ పుట్టినట్లు తేజస్వీ కూడా నిన్న సాయంత్రం చెప్పారు. వస్తానని మాట ఇచ్చాను. ఈరోజు ఆసుపత్రికి వెళ్లి కలిశాను. ఈ చిన్నారి గొప్పగా ఎదిగి, ఆ కుటుంబానికి అదృష్టంగా, ఆశాకిరణంగా మారాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ మమతా బెనర్జీ చిన్నారిని ఆశీర్వదించారు.
రాజశ్రీ యాదవ్ కోల్కతాలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చినట్లు తేజస్వీ 'ఎక్స్' వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా నవజాత శిశువుతో ఉన్న ఒక ఫొటోను కూడా ఆయన పంచుకున్నారు. దీంతో ఆయనకు, వారి కుటుంబ సభ్యులకు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు పలువురు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ విషయం తెలియడంతో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసుపత్రికి స్వయంగా వెళ్లి తేజస్వీ యాదవ్ దంపతులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పరామర్శకు సంబంధించిన ఫొటోలను మమతా బెనర్జీ తన 'ఎక్స్' ఖాతాలో పంచుకున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కూడా ఆమె అభినందనలు తెలిపారు.
"తేజస్వీ యాదవ్ అర్ధాంగి రాజశ్రీ యాదవ్ మగబిడ్డకు జన్మనివ్వడం చాలా సంతోషంగా ఉంది. వారి ఆనందంలో పాలుపంచుకోవడం నాకు ఆనందాన్నిచ్చింది. ఆ దంపతులకు, లాలూ గారి కుటుంబానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ఆశీస్సులు" అని మమతా బెనర్జీ ట్వీట్లో పేర్కొన్నారు.
"ఈ రోజు వారిని కలవడం ఆనందంగా ఉంది. తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. రాజశ్రీ కోల్కతాలో ఉన్న విషయం తెలుసు. తనకు బిడ్డ పుట్టినట్లు తేజస్వీ కూడా నిన్న సాయంత్రం చెప్పారు. వస్తానని మాట ఇచ్చాను. ఈరోజు ఆసుపత్రికి వెళ్లి కలిశాను. ఈ చిన్నారి గొప్పగా ఎదిగి, ఆ కుటుంబానికి అదృష్టంగా, ఆశాకిరణంగా మారాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ మమతా బెనర్జీ చిన్నారిని ఆశీర్వదించారు.