జర్మనీలో రైల్వే ప్లాట్ ఫామ్ పై నిల్చున్నవారిపై దుండగుడి దాడి

  • జర్మనీలోని హామ్‌బర్గ్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో దారుణ ఘటన 
  • వ్యక్తులపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన ఓ దుండగుడు
  • నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించిన పోలీసులు 
జర్మనీలోని హామ్‌బర్గ్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడటంతో కలకలం రేగింది. ప్లాట్‌ఫామ్ పై నిలబడి ఉన్న వ్యక్తులపై జరిగిన ఈ దాడిలో 8 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

తొలుత ఈ ఘటనలో 8 మందికి గాయాలైనట్లు వార్తలు రాగా, ఆ తర్వాత ఆ సంఖ్య 12కు పెరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే, ఈ ఘటనపై అధికారులు ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది. ప్రస్తుతం పోలీస్ ఆపరేషన్ కొనసాగుతోందని హామ్‌బర్గ్ పోలీసులు 'ఎక్స్' వేదికగా తెలిపారు. ఈ దాడిలో ఒక్కడే పాల్గొన్నాడని, నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 


More Telugu News