గూఢచారి యూట్యూబర్ కు సంబంధించి మరో వీడియో వెలుగులోకి!
- హర్యానాలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్
- పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్గా ఆరోపణలు
- భారత సైనిక రహస్యాలు పాక్కు చేరవేత
- రెండేళ్ల క్రితం సికింద్రాబాద్ వందే భారత్ రైలు ప్రారంభోత్సవంలో హంగామా
దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్కు చేరవేస్తున్నారన్న సంచలన ఆరోపణలతో హర్యానాలో జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆశ్చర్యకరంగా, ఈమె రెండేళ్ల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన వందే భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలకలం సృష్టించిన మహిళే కావడం గమనార్హం.
హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా అనే మహిళ యూట్యూబర్గా కొనసాగుతూనే, పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్)కు ఏజెంట్గా పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. భారత సైనిక దళాలకు చెందిన అత్యంత రహస్యమైన సమాచారాన్ని ఈమె పాకిస్థాన్కు చేరవేస్తున్నట్లు నిర్ధారణ కావడంతో హర్యానా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈమెతో పాటు ఈ వ్యవహారంలో ప్రమేయమున్న మరో ఆరుగురిని కూడా అరెస్టు చేసినట్లు సమాచారం. జ్యోతి ట్రావెల్ వీసాపై పాకిస్థాన్లో కూడా పర్యటించినట్లు దర్యాప్తులో తేలింది.
సికింద్రాబాద్ ఘటనతో లింక్?
సుమారు రెండేళ్ల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన వందే భారత్ రైలు ప్రారంభోత్సవ వేడుకల్లో జ్యోతి మల్హోత్రా హంగామా చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ కార్యక్రమానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్, నాటి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. ఆ సమయంలో జ్యోతి అక్కడ కలకలం సృష్టించడంతో భద్రతా సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని పంపించివేసినట్టు తెలుస్తోంది.
తాజాగా, పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్గా పట్టుబడటంతో, అప్పటి ఆమె ప్రవర్తన వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం జ్యోతి అరెస్టుతో పాటు, ఆమె నెట్వర్క్, గతంలో ఆమె కార్యకలాపాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగే అవకాశాలున్నాయి.
కాగా, కొన్ని నెలల కిందటే ఆమె పహల్గామ్ ను సందర్శించినట్టు వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దాంతో, పహల్గామ్ ఉగ్రదాడికి ఆమెకు లింక్ ఏమైనా ఉందా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా అనే మహిళ యూట్యూబర్గా కొనసాగుతూనే, పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్)కు ఏజెంట్గా పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. భారత సైనిక దళాలకు చెందిన అత్యంత రహస్యమైన సమాచారాన్ని ఈమె పాకిస్థాన్కు చేరవేస్తున్నట్లు నిర్ధారణ కావడంతో హర్యానా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈమెతో పాటు ఈ వ్యవహారంలో ప్రమేయమున్న మరో ఆరుగురిని కూడా అరెస్టు చేసినట్లు సమాచారం. జ్యోతి ట్రావెల్ వీసాపై పాకిస్థాన్లో కూడా పర్యటించినట్లు దర్యాప్తులో తేలింది.
సికింద్రాబాద్ ఘటనతో లింక్?
సుమారు రెండేళ్ల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన వందే భారత్ రైలు ప్రారంభోత్సవ వేడుకల్లో జ్యోతి మల్హోత్రా హంగామా చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ కార్యక్రమానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్, నాటి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. ఆ సమయంలో జ్యోతి అక్కడ కలకలం సృష్టించడంతో భద్రతా సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని పంపించివేసినట్టు తెలుస్తోంది.
తాజాగా, పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్గా పట్టుబడటంతో, అప్పటి ఆమె ప్రవర్తన వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం జ్యోతి అరెస్టుతో పాటు, ఆమె నెట్వర్క్, గతంలో ఆమె కార్యకలాపాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగే అవకాశాలున్నాయి.
కాగా, కొన్ని నెలల కిందటే ఆమె పహల్గామ్ ను సందర్శించినట్టు వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దాంతో, పహల్గామ్ ఉగ్రదాడికి ఆమెకు లింక్ ఏమైనా ఉందా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.