ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన ఏపీ మంత్రి నారా లోకేశ్... ఫోటోలు ఇవిగో

AP Minister Nara Lokesh Meets PM Modi in Delhi
  • ఇటీవల అమరావతి  వచ్చిన ప్రధాని మోదీ
  • ఢిల్లీ వచ్చి నన్ను ఎందుకు కలవడంలేదు అంటూ లోకేశ్ పై చిరుకోపం
  • ఇవాళ కుటుంబ సమేతంగా వెళ్లి మోదీని కలిసిన లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌, దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీకి ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

శనివారం సాయంత్రం నారా లోకేశ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి దేశ రాజధాని దిల్లీకి చేరుకున్నారు. అనంతరం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశం ప్రధానమంత్రి ఆహ్వానం మేరకే జరిగినట్లు తెలుస్తోంది.

కొద్ది రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతిలో పర్యటించిన విషయం విదితమే. ఆ పర్యటన సందర్భంగా, నారా లోకేశ్‌ను దిల్లీ వచ్చి తనను కలవాల్సిందిగా ప్రధాని సూచించారు. ఈ నేపథ్యంలోనే, లోకేశ్‌ ఇవాళ తన కుటుంబ సభ్యులతో కలిసి దిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ, లోకేశ్ దంపతుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుమారుడు, చిన్నారి దేవాన్ష్‌ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముచ్చటించారు. కుటుంబపరమైన విషయాలతో పాటు, ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు కూడా వీరిరువురి మధ్య చర్చకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.




Go Back to Shorts
Nara Lokesh
Narendra Modi
Andhra Pradesh
Delhi Meeting
AP Minister
IT Minister
Modi Lokesh Meeting
Family Meeting
India Politics

More Telugu News