Goods Train Accident: పట్టాలు దాటుతుంటే సడెన్ గా కదిలిన గూడ్స్ ట్రైన్.. వీడియో ఇదిగో!
––
తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ లో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటే క్రమంలో ఓ కార్మికుడు గూడ్స్ ట్రైన్ కింది నుంచి వెళుతుండగా సడెన్ గా ట్రైన్ కదిలింది. దీంతో ఆ కార్మికుడు చాకచక్యంగా వ్యవహరించి పట్టాల మధ్యలో పడుకుండిపోయాడు. అదృష్టవశాత్తూ ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. అక్కడ ఉన్న వారు ఈ ఘటనను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
తిమ్మాపూర్ పారిశ్రామికవాడలోని ఓ కంపెనీలో బీహార్ కు చెందిన వ్యక్తి పనిచేస్తున్నాడు. నిత్యం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాల పైనుంచి రాకపోకలు సాగించేవాడు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం కంపెనీలో విధులు పూర్తిచేసుకుని ఇంటికి తిరిగి వెళ్లేందుకు పట్టాలు దాటుతుండగా ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇలాంటి ఘటనలు ఇదివరకు కూడా రెండు మూడు చోటు చేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. పాదచారుల కోసం సమీపంలోనే ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉన్నప్పటికీ చాలామంది పట్టాలు క్రాస్ చేసి వెళుతుంటారు. ఇది ప్రమాదకరమని, పట్టాలు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని మాత్రమే ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు.
తిమ్మాపూర్ పారిశ్రామికవాడలోని ఓ కంపెనీలో బీహార్ కు చెందిన వ్యక్తి పనిచేస్తున్నాడు. నిత్యం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాల పైనుంచి రాకపోకలు సాగించేవాడు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం కంపెనీలో విధులు పూర్తిచేసుకుని ఇంటికి తిరిగి వెళ్లేందుకు పట్టాలు దాటుతుండగా ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇలాంటి ఘటనలు ఇదివరకు కూడా రెండు మూడు చోటు చేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. పాదచారుల కోసం సమీపంలోనే ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉన్నప్పటికీ చాలామంది పట్టాలు క్రాస్ చేసి వెళుతుంటారు. ఇది ప్రమాదకరమని, పట్టాలు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని మాత్రమే ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు.