Lt Gen DS Rana: 'ఆపరేషన్ సిందూర్'పై 70 దేశాలకు భారత్ బ్రీఫింగ్

India Briefs 70 Countries on Operation Sindhu

  • 70 దేశాల దౌత్యాధికారులకు రక్షణ నిఘా సంస్థ డీజీ వివరణ
  • లక్ష్యాల ఎంపిక, భారత సైనిక సామర్థ్యం, తప్పుడు ప్రచార ఖండనపై స్పష్టత
  • కేంద్ర మంత్రివర్గం, పార్లమెంటరీ కమిటీకి కూడా ఆపరేషన్ వివరాలు

పీఓకే, పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్’కు సంబంధించిన కీలక వివరాలను అంతర్జాతీయ సమాజానికి భారత్ తెలియజేసింది. ఈ ఆపరేషన్ గురించి రక్షణ నిఘా సంస్థ (డీఐఏ) డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్‌ జనరల్‌ డీఎస్‌ రాణా సుమారు 70 దేశాలకు చెందిన దౌత్యాధికారులకు సమగ్రంగా వివరించారు. ఢిల్లీలోని రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో, ‘ఆపరేషన్‌ సిందూర్’ కోసం లక్ష్యాలను ఏ విధంగా ఎంపిక చేశారో, ఈ ఆపరేషన్‌లో ప్రదర్శితమైన భారత సైనిక శక్తిసామర్థ్యాలను లెఫ్టినెంట్‌ జనరల్‌ డీఎస్‌ రాణా దౌత్యవేత్తలకు వివరించారు. భారతదేశానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు చేసిన తప్పుడు ప్రచారాన్ని, దాని వల్ల ప్రాంతీయ స్థిరత్వంపై పడే ప్రభావాన్ని ఆయన స్పష్టంగా తెలియజేశారు. అటువంటి తప్పుడు సమాచారాన్ని భారత్ ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కొందో కూడా ఆయన వివరించారు.

మరోవైపు, ‘ఆపరేషన్‌ సిందూర్’ నేపథ్యంలో భవిష్యత్ భద్రతా వ్యూహాలు, సైనిక సన్నద్ధతపై చర్చించేందుకు బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. మరోవైపు, ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను విదేశాంగ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘ సభ్యులతో కూడా కేంద్ర ప్రభుత్వం పంచుకోనుంది. మే 19వ తేదీన పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ శశిథరూర్ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ ‘ఆపరేషన్‌ సిందూర్’ వివరాలను సభ్యులకు వెల్లడించనున్నారు.

Lt Gen DS Rana
Operation Sindhu
India
Pakistan
PoK
Terrorism
Military Operation
International Briefing
  • Loading...

More Telugu News