కల్లి తండాకు వెళ్లి వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్
- జమ్మూకశ్మీర్ లో వీర మరణం పొందిన మురళీ నాయక్
- ఈ నెల 13న కల్లి తండాకు వెళ్లనున్న జగన్
- ఇప్పటికే మురళి కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించిన జగన్
మురళీ నాయక్ అగ్నివీర్ పథకం కింద మూడేళ్ల క్రితం ఆర్మీలో చేరారు. నాసిక్ లో శిక్షణ పొంది అసోంలో పని చేశారు. పాకిస్థాన్ తో యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పాక్ బలగాలను అడ్డుకునే ప్రయత్నంలో ఆయన వీర మరణం పొందారు. మురళి మృతి పట్ల అన్ని పార్టీల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.