తిరుప‌తి జిల్లాలో ఘోర ప్ర‌మాదం.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

Five Killed in Horrific Tirupati Road Accident
    
తిరుప‌తి జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. పూత‌ల‌ప‌ట్టు-నాయుడుపేట జాతీయ ర‌హ‌దారిపై పాకాల మండ‌లం తోట‌ప‌ల్లి వ‌ద్ద కంటైన‌ర్ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. 

స‌మాచారం అందుకున్న పోలీసులు ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డిన వారిని స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. 
Go Back to Shorts
Road Accident
Tirupati District
Fatal Car Accident
Andhra Pradesh Accident
National Highway Accident
Pootapalli Accident
Container Truck Accident
Five Killed
Road Safety
Tirupati
Andhra Pradesh

More Telugu News