Pakistan High Commission: పాక్ హైకమిషన్ వద్ద కేక్ కలకలం.. వైరల్ గా మారిన వీడియో ఇదిగో!

Pakistan High Commission Cake Incident Sparks Outrage After Pulwama Attack
--
పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ దాడిలో మొత్తం 26 మంది మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు. ఈ దారుణ ఘటన అనంతరం ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 500 మందికి పైగా నిరసనకారులు పాక్ హైకమిషన్ సమీపంలో ఆందోళన చేపట్టారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ, ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదే సమయంలో, పాకిస్థాన్ హైకమిషన్‌కు ఒక వ్యక్తి కేక్ బాక్స్‌తో వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాడి జరిగిన రెండు రోజులకే ఈ సంఘటన జరగడంతో వివాదం చెలరేగింది. విలేకరులు ప్రశ్నించినప్పటికీ, ఆ వ్యక్తి కేక్ ఎందుకు తీసుకెళ్తున్నాడో వెల్లడించలేదు. ఓవైపు పహల్గామ్ లో ఉగ్రవాదులు 26 మంది అమాయక పర్యాటకులను పొట్టనపెట్టుకుంటే పాక్ హైకమిషన్ లో కేకుతో వేడుకలు జరుపుకుంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Pakistan High Commission
Viral Video
Cake Controversy
Pulwama Attack
India-Pakistan Relations
Protest
Delhi
Social Media
Terrorism

More Telugu News