మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని మ‌రిది గోపి అరెస్ట్‌

    
ఏపీ మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని మ‌రిది గోపిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైద‌రాబాద్‌లో ఆయ‌న్ను అరెస్ట్ చేసి విజ‌య‌వాడ‌కు త‌ర‌లిస్తున్నారు. య‌డ్ల‌పాడులో కంక‌ర క్వారీ య‌జ‌మానుల‌ను బెదిరించి డ‌బ్బు వ‌సూలు చేశార‌ని గోపితో పాటు విడ‌ద‌ల ర‌జినిపై కేసు న‌మోదైంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఏపీ ఏసీబీ అధికారులు గోపిని అరెస్ట్ చేశారు. 


More Telugu News