జ‌న‌సేన కీల‌క ప్ర‌క‌ట‌న‌

  • జ‌న‌సేన 'జ‌న‌వాణి' కార్య‌క్ర‌మం ప‌ని వేళల్లో మార్పు
  • సోమ‌వారం నుంచి గురువారం వ‌ర‌కు కార్య‌క్ర‌మం
  • ఆయా రోజుల్లో ఉద‌యం 9.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు
  • కొన‌సాగింపుగా సాయంత్రం 4.30 గంట‌ల నుంచి 5.30 గంట‌ల వ‌ర‌కు 'జ‌న‌వాణి'
  • ఈరోజు నుంచే కొత్త ప‌ని వేళలు అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని పార్టీ ప్ర‌క‌ట‌న‌
ఏపీ డిప్యూటీ సీఎం, జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌తంలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు 'జ‌న‌వాణి' కార్య‌క్ర‌మాన్ని తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. వివిధ స‌మ‌స్య‌ల‌తో ఈ జ‌న‌వాణికి వ‌చ్చిన ప్ర‌జ‌ల‌ను స్వ‌యంగా జ‌న‌సేనాని క‌లిసి వారి నుంచి విన‌తి ప‌త్రాల‌ను తీసుకుని వాటిని ప‌రిష్క‌రించే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. 

ఈ క్ర‌మంలో తాజాగా జ‌న‌సేన ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వేస‌వి కాలం నేప‌థ్యంలో 'జ‌న‌వాణి'కి వ‌చ్చే ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం ఈ కార్య‌క్ర‌మం ప‌నివేళ‌ల‌ను మార్చిన‌ట్లు పార్టీ ప్ర‌క‌టించింది. ఇక‌పై సోమ‌వారం నుంచి గురువారం వ‌ర‌కు ఉద‌యం 9.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు, కొన‌సాగింపుగా సాయంత్రం 4.30 గంట‌ల నుంచి 5.30 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తారు. ఈ కొత్త ప‌ని వేళ‌లు ఇవాళ్టి (ఏప్రిల్ 21) నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని జ‌న‌సేన తెలిపింది. ఈ మేర‌కు మంగ‌ళ‌గిరి జ‌న‌సేన పార్టీ కేంద్ర కార్యాల‌యం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.   



More Telugu News