ఉప్పల్ స్టేడియంలో దొంగల చేతివాటం
- శనివారం నాడు ఉప్పల్లో తలపడ్డ పీబీకేఎస్, ఎస్ఆర్హెచ్
- ఈ మ్యాచ్లో ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలగా సెల్ ఫోన్ దొంగల చేతివాటం
- స్టేడియంలో భద్రతలో దాదాపు 3 వేలకు పైగా పోలీసుల పహారా
- అయినా భారీగా మొబైల్ ఫోన్ల చోరీ
- ఉప్పల్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు
15 నుంచి 20 మంది తమకు ఫిర్యాదు చేసినట్లు ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ పెను విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. కేవలం 40 బంతుల్లోనే శతకం బాదాడు. దీంతో పీబీకేఎస్ నిర్దేశించిన 246 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్రైజర్స్ ఇంకా 9 బంతులు మిగిలి ఉండగానే, 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.