ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు
- ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
- సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ
- ఆర్పీ సిసోడియా చేనేత, జౌళి శాఖకు బదిలీ
- జయలక్ష్మికి రెవెన్యూశాఖ అదనపు బాధ్యతలు
- పలు శాఖలకు కొత్త డైరెక్టర్ల నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదివారం ఉత్తర్వులు విడుదల చేశారు.
ప్రస్తుతం రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఆర్పీ సిసోడియాను చేనేత, జౌళి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయలక్ష్మికి రెవెన్యూశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేనికి ఏపీ హెచ్ఆర్డీఐ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్గా ముత్యాలరాజును నియమించారు. రైతు బజార్ల సీఈవోగా కె.మాధవీలతను, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ కార్యదర్శిగా గౌతమిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయుష్ డైరెక్టర్గా దినేష్ కుమార్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా నీలకంఠారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఆర్పీ సిసోడియాను చేనేత, జౌళి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయలక్ష్మికి రెవెన్యూశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేనికి ఏపీ హెచ్ఆర్డీఐ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్గా ముత్యాలరాజును నియమించారు. రైతు బజార్ల సీఈవోగా కె.మాధవీలతను, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ కార్యదర్శిగా గౌతమిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయుష్ డైరెక్టర్గా దినేష్ కుమార్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా నీలకంఠారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.