బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్
- బీజేపీ అధ్యక్ష పదవికి నాగేంద్రన్ ఒక్కరి నుంచే నామినేషన్
- కొత్త అధ్యక్షుడిని ప్రకటించిన కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్
- జయలలిత, పన్నీరుసెల్వం ప్రభుత్వాలలో మంత్రిగా పని చేసిన నాగేంద్రన్
కన్యాకుమారి జిల్లాలోని నాగర్కోయిల్ సమీపం వడివీశ్వరంలో 1960లో నాగేంద్రన్ జన్మించారు. ఆయన మొదట అన్నాడీఎంకేలో ఉండగా, ఆ తర్వాత బీజేపీలో చేరారు. 2020 జులై నుంచి ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గతంలో జయలలిత, పన్నీరుసెల్వం ప్రభుత్వాలలో పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్నాడీఎంకే, బీజేపీల మధ్య సమన్వయం కుదిర్చేందుకు ఆయన కీలక పాత్ర పోషిస్తారని భావించి పార్టీ అధిష్ఠానం ఆయనను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అన్నామలైకి జాతీయ స్థాయిలో పదవి లభిస్తుందని ప్రచారం జరుగుతోంది.