మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై కేసు నమోదు
- కూటమి నేతలను నరుకుతామంటూ కారుమూరి తీవ్ర వ్యాఖ్యలు
- నగరపాలెం పీఎస్ లో ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
- విచారణకు రావాలని నోటీసులు ఇస్తామన్న పోలీసులు
కారూమూరి వ్యాఖ్యలపై గుంటూరులోని టీడీపీ నేతలు కనపర్తి శ్రీనివాసరావు, మద్దిరాల మ్యానీ, అడకా శ్రీను ఫిర్యాదు చేశారు. నగరపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు రావాలని కారుమురికి నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు.