బీహార్లో ఈదురు గాలులు, వడగళ్ల వాన... పిడుగులు పడి 13 మంది మృతి
పిడుగుపాటుకు మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు. బాధిత కుటుంబాలకు సీఎం సంతాపం తెలిపారు. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో విపత్తు నిర్వహణశాఖ జారీచేసే సూచనల ప్రకారం నడుచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.