పవన్ కుమారుడు మార్క్ శంకర్కు కొనసాగుతున్న చికిత్స
- సింగపూర్ లోని ఆసుపత్రిలో మార్క్ శంకర్కు చికిత్స
- నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లిన పవన్
- నేరుగా ఆసుపత్రికి చేరుకుని కుమారుడిని చూసిన డిప్యూటీ సీఎం
- అక్కడి వైద్యులు, అధికారులతో మాట్లాడిన జనసేనాని
మార్క్ కోలుకొంటున్నాడని, ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడం వలన తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులు తెలియజేశారు. భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి మార్క్ ను వేరే గదికి మార్చినట్లు తెలుస్తోంది. మరో మూడు రోజులపాటు వైద్యపరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు.