సింగపూర్ బయల్దేరిన పవన్ కల్యాణ్
- సింగపూర్ లో అగ్నిప్రమాదం
- గాయపడిన పవన్ తనయుడు మార్క్ శంకర్
- అందరి ఆశీస్సులతో తన కుమారుడు కోలుకుంటున్నాడన్న పవన్
అందరి ఆశీస్సులతో మార్క్ కోలుకుంటున్నాడు
అగ్ని ప్రమాదంలో గాయపడిన తన కుమారుడు మార్క్ శంకర్ అందరి ఆశీస్సులతో కోలుకుంటున్నాడని పవన్ కల్యాణ్ వెల్లడించారు. తన బిడ్డ క్షేమం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ ఓ లేఖను విడుదల చేశారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన పెద్ద కుమారుడు అకీరా పుట్టినరోజు నాడే చిన్న కుమారుడికి ఇలా జరగడం బాధ కలిగించిందని అన్నారు.