పులివెందుల టీడీపీలో బయటపడ్డ విభేదాలు!
- బీటెక్ రవి, రాంగోపాల్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు
- మంత్రి సవిత ఆధ్వర్యంలో పులివెందులలో విస్తృతస్థాయి సమావేశం
- సవిత సమక్షంలో బాహాబాహీకి దిగిన ఇరు వర్గాలు
ఈ సమావేశం జిల్లా ఇన్ఛార్జ్, మంత్రి సవిత ఆధ్వర్యంలో జరిగింది. ఆమె సమక్షంలోనే ఇరు వర్గాలు గొడవకు దిగాయి. వేదికపై రాంగోపాల్ రెడ్డి ఉండకూడదని, వేదిక దిగిపోవాలని బీటెక్ రవి వర్గీయులు నినాదాలు చేశారు. దీంతో, రాంగోపాల్ రెడ్డి వర్గీయులు కూడా పోటీపోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పారు. అనంతరం విస్తృతస్థాయి సమావేశం సజావుగా కొనసాగింది.