Mark Shankar: మార్క్ శంకర్ ని చూసేందుకు సింగపూర్ వెళుతున్న చిరంజీవి దంపతులు

Chiranjeevi Couple to Visit Mark Shankar in Singapore

  • సింగపూర్ స్కూళ్లో అగ్నిప్రమాదం
  • పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కి గాయాలు
  • ఈ దుర్ఘటనలో ఒక బాలిక మృతి

సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డ సంగతి తెలిసిందే. ఎనిమిదేళ్ల మార్క్ ప్రస్తుతం సింగపూర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో దాదాపు 20 మంది చిన్నారులు గాయపడ్డారు. పదేళ్ల బాలిక మృతి చెందింది. 

ఈ ఘటనపై చిరంజీవి స్పందిస్తూ మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు. మరోవైపు, మార్క్ శంకర్ ను చూసేందుకు చిరంజీవి, ఆయన భార్య సురేఖ సింగపూర్ కి వెళ్లనున్నారు. పవన్ కల్యాణ్ కూడా సింగపూర్ కి వెళుతున్నారు. 

Mark Shankar
Pawan Kalyan
Chiranjeevi
Singapore
School Fire
Accident
Injury
AP Deputy CM
Suresh Babu
  • Loading...

More Telugu News