కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం... మన్నె క్రిశాంక్కు హైకోర్టు ఆదేశం
- ఏఐ వీడియోలు సృష్టించి పోస్టు చేశారంటూ మన్నె క్రిశాంక్పై కేసు
- తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్రిశాంక్ పిటిషన్
- పోలీసుల విచారణకు సహకరించాలని క్రిశాంక్కు హైకోర్టు ఆదేశాలు
ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మన్నె క్రిశాంక్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పోలీసుల విచారణకు సహకరించాలని ఆయనను ఆదేశించింది. అలాగే కొణతం దిలీప్నకు నోటీసులు జారీ చేయాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఒకే ఘటనపై నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది రమణారావు కోర్టుకు తెలియజేశారు. రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టారని ఆయన కోర్టుకు తెలిపారు. కంచ గచ్చిబౌలి భూముల ఘటనపై ఏఐ వీడియోలు, పోస్టులు చేసి వైరల్ చేశారని, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.