కియా కంపెనీలో భారీ దొంగతనం.. 900 కారు ఇంజన్లు మాయం
--
ఈ చోరీకి సంబంధించి గత నెల 19న కంపెనీ ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు. తొలుత ఫిర్యాదు లేకుండా విచారణ జరిపించాలని కోరగా.. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే దర్యాప్తు చేపడతామని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో కంపెనీ ప్రతినిధులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కియా కంపెనీలో కారు ఇంజన్ల చోరీపై పోలీసులు ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించారని, దర్యాప్తు కూడా పూర్తయిందని సమాచారం. పోలీసు ఉన్నతాధికారులు త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.