వక్ఫ్ వివాదం... బీజేపీ నేత ఇంటికి నిప్పు
- రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారిన వక్ఫ్ సవరణ బిల్లు
- వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు
- మణిపూర్ బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడి నివాసంపై ముస్లింల దాడి
ఈ దాడితో పోలీసులు అలర్ట్ అయ్యారు. అస్కర్ అలీ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ముస్లిం సమాజానికి అస్కర్ క్షమాపణ చెప్పారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడొద్దని హెచ్చరించారు. తుపాకులు, కత్తులు, కర్రలు, రాళ్లు వంటి వస్తువులు దగ్గర ఉంచుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు.