టీటీడీ ఛైర్మన్ కు బండి సంజయ్ లేఖ
- కరీంనగర్ లో టీటీడీ ఆలయ నిర్మాణానికి 2023లో అనుమతి లభించిందన్న సంజయ్
- 10 ఎకరాల భూమిలో భూమిపూజ కూడా జరిగిందని వెల్లడి
- ఆలయ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగేలా చర్యలు తీసుకోవాలని విన్నపం
2023లో కరీంనగర్ లో టీటీడీ ఆలయ నిర్మాణానికి అనుమతి లభించిందని, అదే ఏడాది మే 31న 10 ఎకరాల భూమిలో భూమిపూజ కూడా జరిగిందని బండి సంజయ్ తెలిపారు. అయితే, ఆ తర్వాత ఆలయం నిర్మాణం దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పారు. టీటీడీ నిర్మించే ఆలయం కోసం కరీంనగర్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల భక్తులు కూడా ఎదురు చూస్తున్నారని.... ఆలయ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.