నిర్దోషులను షర్మిల బలి చేయాలనుకుంటోంది: రోజా
- చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మగా మారారన్న రోజా
- వివేకాను చంపామన్న వారిని అప్రూవర్లుగా మార్చారని విమర్శ
- జగన్ ను ఇబ్బంది పెట్టడమే షర్మిల లక్ష్యమని మండిపాటు
వివేకా హత్య కేసులో నిర్దోషులను బలి చేయాలన్న ఆరాటం షర్మిలకు ఎందుకని రోజా ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రూపొందించుకున్న కుట్రలో షర్మిల ఒక అస్త్రంగా మారారని విమర్శించారు. ఇందులో భాగంగానే నిర్దోషులపై బురద చల్లుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సొంత అన్న జగన్ ను ఇబ్బంది పెట్టడమే మీ అసలైన లక్ష్యమని అన్నారు.