సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన టీటీడీ సమావేశం

  • చంద్రబాబుతో సమావేశమైన టీటీడీ పెద్దలు బీఆర్ నాయుడు, శ్యామలరావు, వెంకన్న చౌదరి
  • టీటీడీకి పలు సూచనలు చేయనున్న చంద్రబాబు
  • వివిధ అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళతామన్న బీఆర్ నాయుడు
సచివాలయంలో సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన టీటీడీ సమావేశం  ప్రారంభమైంది. ఈ సమావేశానికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు,ఈఓ శ్యామలరావు, జేఈవో వెంకన్న చౌదరి తదితర అధికారులు హాజరయ్యారు. 

వేసవి దృష్ట్యా తిరుమలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చంద్రబాబు పలు సూచనలు చేయనున్నారు. తిరుమలలో పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. సీఎం చంద్రబాబు టీటీడీ పూర్తిస్థాయి ప్రక్షాళన, అభివృద్ధి తో పాటు.... తిరుమల పవిత్రత పెంపుదలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

ఏఐ టెక్నాలజీ తో శ్రీవారి దర్శనం, వసతి తదితర సదుపాయాల కల్పన, అన్యమత ఉద్యోగులను ప్రభుత్వశాఖలకు బదిలీ చేయడం... దేశ, విదేశాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మాణం... గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారం జరిగిన నిధులు కేటాయింపులు... ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికారులు‌ బదిలీలు తదితర కీలక‌ ఆంశాలను తాము ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళతామని బీఆర్ నాయుడు వివరించారు.


More Telugu News