ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ అధికారి వ్యాఖ్యలు.. ఎంఈవో తీరుపై విమర్శలు
- సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం
- వైసీపీ అనుబంధ సంఘంలో మెసేజ్ లు
- ఉపాధ్యాయుల అధికారిక సమావేశంలోనూ కూటమి సర్కారుపై విమర్శలు
ఉపాధ్యాయుల అధికారిక సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఈ ప్రభుత్వంతో ఒరిగేదేమీ లేదు.. పాత ప్రభుత్వమే మళ్లీ వస్తుంది. గతంలో పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అనుసరించిన విధానాలే మంచివి అనుకునే స్థాయి వస్తుంది చూడండి’ అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ మండలానికి ఇద్దరు ఎంఈవోలు ఉండగా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న ఎంఈవోపై తోటి ఎంఈవో ఫిర్యాదు చేశారు. పాఠశాల విద్య ఆర్జేడీకి రాతపూర్వకంగా ఫిర్యాదు సమర్పించారు.
సదరు ఎంఈవోపై గతంలోనూ పలు ఆరోపణలు వెల్లువెత్తాయని, ఒకసారి మహిళలు ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. మరో సందర్భంలో మహిళా ఉద్యోగినితో అసభ్యకరంగా ప్రవర్తించి ఘర్షణ పడ్డారని సమాచారం. ప్రభుత్వ అధికారిగా విధులు నిర్వహిస్తూ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం జరపడం సరికాదని, సదరు ఎంఈవోపై ఉద్యోగుల ప్రవర్తన నియమావళి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.