విజయవాడలో పర్యటించిన మహేశ్ బాబు అర్ధాంగి నమ్రత
ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ, అనేక సందర్భాల్లో శిశువులకు తల్లి పాలు అందక ఇబ్బందులు ఎదురవుతుంటాయని, అలాంటి వారికి ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్ ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.
ఆంధ్ర హాస్పిటల్స్ ఎండీ రమణమూర్తి మాట్లాడుతూ... మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ను నివారించే వ్యాక్సిన్ కోసం మహేశ్ బాబు ఫౌండేషన్ తో కలిసి కృషి చేస్తున్నట్టు చెప్పారు.