సొంతపార్టీ నేతలపై రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
- సీఎం రేవంత్ ను రహస్యంగా కలుస్తున్నారని ఆరోపణ
- సీనియర్ నేతలకు రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టాలంటూ ఫైర్
- తెలంగాణలో బీజేపీతోనే హిందువులకు రక్షణ అని వెల్లడి
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఈ చర్యలు తీసుకోవాలంటూ అధిష్ఠానానికి రాజా సింగ్ సూచించారు. కాగా, ఇటీవలి కాలంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చిన రాజా సింగ్.. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన బీజేపీ జిల్లా అధ్యక్షుల ఎంపికపైనా ఆయన అసహనం వ్యక్తం చేశారు.