మహిళా దినోత్సవ సభలో రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలే: హరీశ్ రావు
- పరేడ్ గ్రౌండ్ సాక్షిగా రేవంత్ అబద్ధాలు చెప్పారన్న హరీశ్ రావు
- మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్లు ఇచ్చి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
- సీఎం, డిప్యూటీ సీఎం గోబెల్స్ ప్రచారంలో ఆరితేరిపోయారని విమర్శలు
ముఖ్యమంత్రికి తోడు డిప్యూటీ సీఎం (మల్లు భట్టి విక్రమార్క) కూడా గోబెల్స్ ప్రచారంలో ఆరితేరారని విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిందే ఇస్తూ... రూ.21 వేల వడ్డీ లేని రుణం అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలను కాంగ్రెస్ సర్కారు మరింత మోసం చేస్తోందని, ఇచ్చే రూ.5 లక్షల వడ్డీ లేని రుణం కూడా ఇప్పటివరకు విడుదల చేయలేదని ఆరోపించారు.
ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది గుండు సున్నా అని, కాంగ్రెస్ ప్రచారం అంతా బోగస్, డొల్ల అని హరీశ్ రావు విమర్శించారు. నిన్న మీ అబద్ధాలు వినలేక సభ నుంచి మహిళలు వెళ్లిపోయారని వెల్లడించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అబద్ధాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు.