లారీని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. ముగ్గురి మృతి
- హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతుండగా ఏలూరు జిల్లాలో ప్రమాదం
- మరో 20 మందికి తీవ్ర గాయాలు
- కడప జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురి మృతి
- 50 అడుగుల లోయలో పడటంతో మూడు ముక్కలైన లారీ
వైఎస్సార్ జిల్లాలో మరో ముగ్గురు
వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని మద్దిమడుగు ఘాట్ రోడ్లో జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. చేపల మేత లోడుతో బెంగళూరు నుంచి ఏలూరుకు వెళుతున్న లారీ మద్దిమడుగు ఘాట్ పైన నాలుగో మలుపు వద్దకు రాగానే బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి 50 అడుగుల లోయలో పడిపోయింది. డ్రైవర్ సాంబయ్య, క్లీనర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చక్రాయపేట మండలం కప్పకుంటపల్లెకు చెందిన కె. వివేకానందరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 50 అడుగుల లోయలో పడిపోవడంతో లారీ మూడు ముక్కలైంది.