చికెన్ మేళాకు ఎగబడిన జనాలు.. ఎక్కడంటే..!
- రాజమండ్రిలో చికెన్ మేళా
- వివిధ రకాల చికెన్ వంటకాల ఏర్పాటు
- ఎగబడి చికెన్ వంటకాలను ఆరగించిన నాన్ వెజ్ ప్రియులు
వంద డిగ్రీల వేడితో చికెన్ ఉడికించి తినడం వల్ల బర్డ్ ఫ్లూ మనిషికి వచ్చే అవకాశం లేదని తెలియజేసేందుకే ఈ మేళా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్, గుడ్డు అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిందని, పౌల్ట్రీ రంగానికి అపార నష్టం వాటిల్లిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేళాకు ప్రజల నుంచి మంచి స్పందన లభించడం తమకు సంతోషంగా ఉందని తెలిపారు.
బర్డ్ ఫ్లూ భయంతో గత కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో జనాలు చికెన్ తినడం మానివేశారు. దీంతో చికెన్ అమ్మకాలు పడిపోయాయి.