హైదరాబాద్ జూపార్క్లో పెరగనున్న ధరలు
- ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి కొత్త ధరలు
- జూపార్కు ప్రవేశ రుసుము పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.40గా నిర్ణయం
- కమర్షియల్ మూవీ చిత్రీకరణకు రూ.10 వేలు వసూలు
ఇకపై జూపార్కు సందర్శనకు ప్రవేశ రుసుము పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.40 చొప్పున వసూలు చేయనున్నారు. ఫొటో కెమెరాకు అనుమతి ఇస్తే రూ.150, వీడియో కెమెరా రూ.2,500, సినిమా చిత్రీకరణ కోసం రూ.10 వేలు ఛార్జీని వసూలు చేయనున్నారు.
జూపార్కులో రైలు ప్రయాణానికి పెద్దలకైతే రూ.80, పిల్లలకైతే రూ.40గా నిర్ణయించారు. బ్యాటరీ ఆపరేటెడ్ వాహనం ఎక్కితే పెద్దలకు రూ.120, పిల్లలకు రూ.70 చొప్పున నిర్ణయించారు. సఫారీ పార్కు డ్రైవ్ సీఎన్జీ బస్సు 20 నిమిషాలకు ఏసీ అయితే రూ.150, నాన్-ఏసీ అయితే రూ.100 చొప్పున వసూలు చేయనున్నారు. 11 సీట్లు కలిగిన కొత్త బ్యాటరీ ఆపరేటెడ్ వాహనం 60 నిమిషాలకు రూ.3,300, 14 సీట్ల బీవోవీ ఎక్స్క్లూజివ్ వాహనం అయితే రూ.4,000 వసూలు చేయనున్నారు.
వాహనాల పార్కింగ్ విషయానికి వస్తే సైకిల్కు రూ.10, ద్విచక్ర వాహనం రూ.30, ఆటో రూ.80, కారు లేదా జీపు అయితే రూ.100, టెంపో లేదా తూఫాన్ అయితే రూ.150, 21 సీట్లు కలిగిన మినీ బస్సు రూ.200, 21 సీట్లు కలిగిన బస్సుకు రూ.300 చొప్పున ధరను నిర్ణయించారు.