ఐ మిస్ యూ... గౌతమ్: జగన్
- మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి మూడో వర్ధంతి నేడు
- భావోద్వేగంగా స్పందించిన జగన్
- 2022 ఫిబ్రవరి 21న గుండెపోటుతో కుప్పకూలిన గౌతమ్
ఏపీ ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న గౌతమ్ రెడ్డి 2022 ఫిబ్రవరి 21న హైదరాబాదులోని తన నివాసంలో గుండెపోటుతో కుప్పకూలారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. 49 ఏళ్ల చిన్న వయసులోనే గౌతమ్ మృతి చెందడం అందరినీ కలచి వేసింది.