Tirumala Laddu Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో నిందితులకు ముగిసిన సిట్ విచారణ

SIT questioning concluded in the case of adulterated ghee usage in Tirumala laddu making
షార్ట్స్‌లో చూడండి
తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితులకు సిట్ విచారణ నేటితో ముగిసింది. తిరుపతిలో సిట్ కార్యాయంలో ఐదు రోజుల పాటు ఈ విచారణ సాగింది. సిట్ అధికారులు కస్టడీలో వివిధ అంశాలపై సమాచారం రాబట్టారు. 

భోలే బాబా డెయిరీ మాజీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, శ్రీ వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ లను సిట్ ప్రశ్నించింది. నలుగురు నిందితులకు తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కస్టడీ ముగిసిన అనంతరం నిందితులను పోలీసులు తిరుపతి రెండో అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.
Go Back to Shorts
Tirumala Laddu Case
Ghee
SIT
Tirupati
TTD

More Telugu News