అభిమానిని చూసి కాన్వాయ్ ఆపిన చంద్రబాబు
- మంగళం దారిలో ఒక్కసారిగా కారు ఆపిన సీఎం చంద్రబాబు
- రోడ్డు పక్కన నిలుచున్న అభిమాని బాషాని దగ్గరకు పిలిచి ఆప్యాయంగా పలకరింపు
- చంద్రబాబు గుర్తు పట్టి పిలిచి పలకరించడంతో సంతోషాన్ని వ్యక్తం చేసిన బాషా
చంద్రబాబు ఆప్యాయ పలకరింపుతో బాషా ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ సందర్భంగా అతను భావోద్వేగానికి గురయ్యాడు. చంద్రబాబు పలకరించిన ఎస్ఏ అజీజ్ బాషా మంగళం సమీపంలోని శేషాచల నగర్కు చెందిన సీనియర్ టీడీపీ కార్యకర్త. చంద్రబాబుతో తనకు 40 ఏళ్లుగా పరిచయం ఉందని, ఆయనను చూసేందుకు వచ్చినా, భద్రతా కారణాలతో రోడ్డు పక్కన నిలుచుండిపోయానని బాషా మీడియాతో అన్నారు. చంద్రబాబు తనను చూసి గుర్తుపట్టి పలకరించడం ఈ జన్మకిది చాలు అంటూ బాషా సంతోషాన్ని వ్యక్తం చేశాడు.