విశాఖ స్టీల్ ప్లాంట్ పై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ
- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్రానికి లేదన్న శ్రీనివాస వర్మ
- చంద్రబాబు, లోకేశ్ కృషి వల్ల ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందన్న కేంద్ర సహాయ మంత్రి
- ప్లాంట్ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందని వెల్లడి
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కృషితో విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందని కేంద్ర సహాయ మంత్రి చెప్పారు. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం రూ. 11,400 కోట్ల ప్యాకేజీని ఇచ్చిందని తెలిపారు. ప్లాంట్ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ను నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.