యాసిడ్ దాడి ఘటన.. కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం.. బాధితురాలికి అండగా ఉంటామన్న మంత్రి లోకేశ్
- ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘటన
- ఈ దాడిని తీవ్రంగా ఖండించిన సీఎం చంద్రబాబు
- బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్న సీఎం
- ఈ ఘటన తీవ్ర ఆందోళనకు గురి చేసిందన్న మంత్రి నారా లోకేశ్
అటు ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్ర ఆందోళనకు గురి చేసిందన్నారు. బాధితురాలికి మెరుగైన వైద్య సాయం అందించి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. ఆమె పట్ల అత్యంత పాశవికంగా వ్యవహరించిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.